ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలి
ABN , First Publish Date - 2020-10-03T11:20:42+05:30 IST
ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సుదగాని హరిశంకర్గౌడ్ గెలుపునకు ప్రతీ పట్టభద్రుడు ..

ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్గౌడ్
ఖమ్మంచర్చికాంపౌండ్, అక్టోబరు2: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సుదగాని హరిశంకర్గౌడ్ గెలుపునకు ప్రతీ పట్టభద్రుడు కృషిచేయాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఓ హోటల్లో జరిగిన ఉమ్మడి ఖమ్మంజిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్యనాయకుల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలను చట్టసభలకు పంపితేనే బీసీల సమస్యల సాధనకు కృషి చేస్తారన్నారు. ఈసమావేశంలో రాష్ట్ర నాయకులు దేవరకొండ నరేష్చారి, జిల్లా అద్యక్షులు పొదిల సతీష్ జిల్లా కార్యదర్శి యలమందల జగదీష్, మహబాద్ జిల్లా అధ్యక్షుడు దేశగాని కృష్ణ, జి.శ్రీనివాస్, మహేష్ డినాగేష్, పిచ్చయ్య, వినోద్ నరేష్, భరత్, మల్లేష్, మహేష్ పాల్గొన్నారు.