ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2020-06-16T10:26:08+05:30 IST
మండల పరిషత్ కార్యాలయంలో డేటా ఆపరేటర్గా పనిచేస్తున్న బి.సునీత(24) సోమవారం మృతి చెందారు.

తిరుమలాయపాలెం, జూన్15: మండల పరిషత్ కార్యాలయంలో డేటా ఆపరేటర్గా పనిచేస్తున్న బి.సునీత(24) సోమవారం మృతి చెందారు. ఖమ్మానికి చెందిన సునీత తిరుమలాయపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు ఏడాది క్రితం వివాహం కాగా, ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఒక్కసారిగా పల్స్, బీపీ లెవల్ పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందారు. ఆమె మృతిపట్ల ఎంపీడీవో జయరాం, ఈవోఆర్డీ రాజేశ్వరి, కార్యదర్శు లు బాలాజీ, సునీత సంతాపం తెలిపారు.