మంత్రుల పర్యటనపై సీపీ, కలెక్టర్ సమీక్ష
ABN , First Publish Date - 2020-12-07T04:27:29+05:30 IST
మంత్రుల పర్యటన అంతరాయం లేకుండా సజావుగా కొనసాగేందుకు తీసుకునే చర్యలపై పోలీసు కమిషనర్ తఫ్సీర్ఇక్బాల్, కలెక్టర్ ఆర్వీకర్ణన్ ఆదివారం నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమావేశం నిర్వహిం చారు.

ఖమ్మంక్రైం, డిసెంబరు6: మంత్రుల పర్యటన అంతరాయం లేకుండా సజావుగా కొనసాగేందుకు తీసుకునే చర్యలపై పోలీసు కమిషనర్ తఫ్సీర్ఇక్బాల్, కలెక్టర్ ఆర్వీకర్ణన్ ఆదివారం నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఆయా మార్గాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లించి కాన్వాయ్ వాహనాలను సజావుగా వెళ్లేందుకు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కార్యక్రమం, సభాస్థలి వద్ద పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. అనంతరం సీపీ నూతన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో నగర మునిసిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ట్రెయినీ కలెక్టర్ వరుణ్రెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలుపాల్గొన్నారు.
ప్రారంభోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం కలెక్టరేట్, డిసెంబరు6: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ ఆర్వీకర్ణన్ పరిశీలించారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్, హోంశాఖ మంత్రి ఎండీ మహమూద్ అలీ, రోడ్లుభవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ప్రారంభించనున్నారు. ఐటీ హబ్ వద్ద సభావేధిక ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.