కేటీపీఎస్‌లో ఆంధ్రా ఇంజనీర్ల నియామకానికి కసరత్తు

ABN , First Publish Date - 2020-12-30T04:50:13+05:30 IST

ఐదేళ్ల క్రితం నిర్బంధ రిలీవ్‌కు గురయిన ఆంధ్రా ఇంజనీర్ల నియా మకానికి జెన్‌కో పచ్చజెండా ఊపింది

కేటీపీఎస్‌లో ఆంధ్రా ఇంజనీర్ల నియామకానికి కసరత్తు
పాల్వంచలోని కేటీపీఎస్‌ కర్మాగారం

సీనియారిటీపై ఉత్కంఠ

పాల్వంచ, డిసెంబరు 29: ఐదేళ్ల క్రితం నిర్బంధ రిలీవ్‌కు గురయిన ఆంధ్రా ఇంజనీర్ల నియా మకానికి జెన్‌కో పచ్చజెండా ఊపింది. పాల్వంచలోని కేటీపీఎస్‌లో ఇంజనీర్ల బర్తీపై కసరత్తు సా గుతోంది. కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌లో ఎక్కడెక్కడ ఖాళీలున్నాయి? ఎవరిని ఎక్కడ బర్తీ చేయాలనే అం శంపై ఉత్కంఠ నెలకొంది. ఇంజనీర్ల రిలీవ్‌ అనంతరం తెలంగాణ ఇంజనీర్లకు ఉద్యోగోన్నతులు క ల్పించిన నేపధ్యంలో వారి సీనియారిటీని ఎలా నిర్ణయించాలనే అంశంపైన చర్చలు నడుస్తున్నాయి. కేటీపీఎస్‌లో సుమారు 20మందికి రీ-పోస్టింగ్‌ ఇవ్వగా వైటీపీపీలో 70మందికి, బీటీపీఎస్‌లో 50 మందికి, పలు జల విద్యుత్‌ కేంద్రాలు, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లలో మరో 50మందిని నియమించారు. కేటీపీఎస్‌లో నియామకం పొందిన ఇంజనీర్లు ఈనెల 20న జాయినింగ్‌ రిపోర్టులు సమర్పించారు. ఆంధ్రా ఇంజనీర్ల స్థానంలో గతంలో ఉద్యోగోన్నతులు పొందిన ఇంజనీర్లకు తిరిగి గతంలో పోస్టులే ఖరారవుతాయనే ప్రచారం నేపధ్యంలో తెలంగాణ ఇంజనీర్లలో ఆందోళన నెలకొంది. ఈక్రమంలో జెన్‌కో అధికారులు ఇంజనీర్ల నుంచి ప్రతిఘటన ఎదురు కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-12-30T04:50:13+05:30 IST