నేడూ రైతుబజార్ల బంద్
ABN , First Publish Date - 2020-03-23T09:52:53+05:30 IST
సోమవారం కూడా అన్ని రైతుబజార్లను బంద్ చేస్తున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో...

ఖమ్మం మార్కెట్, మార్చి 22: సోమవారం కూడా అన్ని రైతుబజార్లను బంద్ చేస్తున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఎవరూ కూరగాయలు తీసుకురావద్దని రైతు కమిటీల ద్వారా వారికి తెలియపరిచారు. ప్రధానంగా జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మూడు రైతు బజార్లను శనివారం రాత్రే గేట్లకు తాళాలు వేసి బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు బోసి పోయాయి. ఉదయం 6 గంటల నుంచే కర్ఫ్యూ ప్రారంభమైన నేపథ్యంలో నగరంలోని వ్యాపారులు చికెన్, మటన్ దుకాణాలను స్వఛ్చందంగా మూసివేశారు. నగరంలో సుమారు 200 షాపులకు పైగా ఉన్న నాన్ వెజ్ మార్కెట్లలో కనీసం ఒక్క షాపు కూడా గేట్లు తెరుచుకోక పోవడం గమనార్హం.