కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించండి: ఇఫ్టూ

ABN , First Publish Date - 2020-11-21T06:32:11+05:30 IST

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలని ఐఎ్‌ఫటియూ( ఇఫ్టూ) పాలేరు ఏరియా కమిటీ అధ్యక్షుడు గోసు పుల్లయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్‌ మండలం, ఎమ్‌ వెంకటాయపాలెం....

కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించండి: ఇఫ్టూ

ఖమ్మం రూరల్‌, నవంబరు 20: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలని ఐఎ్‌ఫటియూ( ఇఫ్టూ) పాలేరు ఏరియా కమిటీ అధ్యక్షుడు గోసు పుల్లయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్‌ మండలం, ఎమ్‌ వెంకటాయపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన ఐఎ్‌ఫటియూ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు భాగాలుగా సవరించి పార్లమెంటులో ఆమోదించడాన్ని వ్యతిరేకించాలన్నారు. కార్మిక వర్గం ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేడు కేంద్రం కార్పోరేట్‌, బహుళ జాతి కంపెనీలకు అనుకూలంగా కార్మకులను బానిసలుగా మార్చేవిధంగా యోచిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జరగబోయో దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శీలం లినిన్‌, పి.నాగేశ్వరరావు, వెంకన్న, బి.నాగయ్య, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T06:32:11+05:30 IST