ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంతవరకు తరగతులు ప్రారంభించొద్దు
ABN , First Publish Date - 2020-06-28T06:38:06+05:30 IST
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు తరగతులు ప్రారంభిచొద్దని ఖమ్మం జిల్లా విద్యాశాఖ
ఖమ్మం డీఈవో మదన్మోహన్
ఖమ్మంచర్చికాంపౌండ్, జూన్ 27: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు తరగతులు ప్రారంభిచొద్దని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి మదన్మోహన్ పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో 2020-21 విద్యాసంవత్సరానికి గాను పాఠశాలల పునఃప్రారంభం తేదీలను ఇంకా ఖరారుచేయలేదని, అందువల్ల ఏ ఒక్క పాఠశాల కూడా ప్రత్యేక్షంగానీ, ఆన్లైన్లో గానీ తరగతులను ప్రారంభించడానికి వీలులేదని పేర్కొన్నారు. అలాగే ఎటువంటి ఫీజులను కూడా వసూలు చేయకూడదని తెలిపారు. అలా చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఫీజులు వసూలు చేస్తే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో 8331851510 నెంబరుకు ఫోన్చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.