రైతులకు రుణాల పంపిణీ

ABN , First Publish Date - 2020-07-01T10:42:21+05:30 IST

మండలంలోని అయ్యవారిగూడెం సొసైటీ పరిధిలోని 63మంది రైతులకు రూ.25లక్షల రుణాలు మంజూరయ్యాయని సొసైటీ చైర్మన్‌ అనుమోలు

రైతులకు రుణాల పంపిణీ

ఎర్రుపాలెం, జూన్‌ 30: మండలంలోని అయ్యవారిగూడెం సొసైటీ పరిధిలోని 63మంది రైతులకు రూ.25లక్షల రుణాలు మంజూరయ్యాయని సొసైటీ చైర్మన్‌ అనుమోలు సాంబశివరావు తెలిపారు. డీసీసీబీ బ్రాంచ్‌లో జరిగిన కార్యక్రమంలో రైతులకు ఆ రుణాల చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ మేనేజర్‌ దివ్య, సూపర్‌వైజర్‌ హనిమిరెడ్డి, సొసైటీ సీఈవో మోహన్‌రావు, సిబ్బంది మురళీ, రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-01T10:42:21+05:30 IST