జిల్లాలో 742 ఉపాధ్యాయ ఖాళీలు

ABN , First Publish Date - 2020-12-16T04:35:03+05:30 IST

జిల్లాలో 742 ఉపాఽధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్‌శర్మ వెల్లడించారు.

జిల్లాలో 742 ఉపాధ్యాయ ఖాళీలు
రికార్డులు పరిశీలిస్తున్న డీఈవో

డీఈవో సోమశేఖర్‌ శర్మ వెల్లడి

ఇల్లెందు, డిసెంబరు 15: జిల్లాలో 742 ఉపాఽధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్‌శర్మ వెల్లడించారు. సెకండీరీగ్రేడ్‌ టీచర్లు 270, స్కూల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు 292, ఎల్‌ఎ్‌ఫఎల్‌ పోస్టులు 63, హెచ్‌ఎంల ఖాళీలు43, పండీట్‌పోస్టులు 35, క్రాప్టు టీచర్ల ఖాళీలు 25, పీఈటి పోస్టులు2 ఖాళీలున్నట్లు ఆయ న తెలిపారు. మంగళవారం ఇల్లెందు మండల విద్యాశాఖ కార్యాలయాన్ని డీఈవో సందర్శించారు. ఈ సందర్బంగా ఆ యన మాట్లాడుతూ విద్యార్ధులందరూ దూరదర్శన్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు వినేవిధంగా ఉపాధ్యాయుడు ప్రతిరోజు విద్యార్ధుల నివాసగృహలు సందర్శించాలని, విద్యార్ధుల సం దేహాలు నివృత్తి చేయాలని ఆదేశించారు. ఉపాధ్యా యులు సమయం పాటించాలని డైరీ రాయాలని మండల్లాలోని కాంప్లెక్స్‌ ప్రదానోపాద్యాయులతో బృందాలు ఏర్పాటు చేసి పాఠశాలలు పర్యవేక్షించి నివేదికలుపంపాలని ఎంఈఓ లను ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో తెలుగు మీడీయంతో పాటు ఇంగ్లీష్‌ మీడీయం సెక్షన్‌లు ఏర్పాటు చేసేందుకు ప్ర తిపాదనలు పంపాలని కోరారు. లక్ష్మిదేవిపల్లి మండలం, చింతవర్రె పాఠశాల ఉపాద్యాయుడు దొడ్డు సునీల్‌ విద్యార్థినులపై లైగింక వేదింపులకు పాల్పడుతున్నాడన్న కారణంగా అతడిని సస్పెండ్‌చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-16T04:35:03+05:30 IST