రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-03T04:10:32+05:30 IST

కామేపల్లి మండలం పండితాపురం బైపాస్‌ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాల య్యా రు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

కామేపల్లి, డిసెంబరు 2: కామేపల్లి మండలం పండితాపురం బైపాస్‌ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాల య్యా రు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన కుసుమరాజు యుగంధర్‌(19), వరుసకు పిన్ని అయిన కర్రి మాలతి(25)ని తన స్కూటీ పైన ఎక్కించు కొని హైద్రాబాద్‌ నుండి వస్తుండగా పండితా పురం గ్రామం వద్ద రోడ్డు మీద నిలిపి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడు యుగంధర్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ స్రవంతి తెలిపారు. 

యువకుడి దుర్మరణం...

 పినపాక : పినపాక మండలం గొట్టెల్ల గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన నూకల చిన సుబ్బారావు (27) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూకల చినసుబ్బారావు బుధవారం టీ కొత్తగూడెం గ్రామంలోని మేనత్త అనారోగ్యంతో చనిపోవడంతో అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న క్రమంలో గొట్టెల్ల గ్రామం వద్ద పంక్చర్‌ కావడంతో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీని ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఏడూళ్ల బయ్యారం సీఐ రమేష్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం తరలించినట్లు సీఐ రమేష్‌ తెలిపారు.   


Updated Date - 2020-12-03T04:10:32+05:30 IST