ముప్పు తెచ్చే పార్టీలను వ్యతిరేకించండి
ABN , First Publish Date - 2020-12-01T05:10:24+05:30 IST
ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజాస్వామ్యానికి ముప్పుతెచ్చే పార్టీలను ప్రజలు వ్యతిరేకించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా కోరారు
సీసీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా
మణుగూరు, నవంబరు 30: ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజాస్వామ్యానికి ముప్పుతెచ్చే పార్టీలను ప్రజలు వ్యతిరేకించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా కోరారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. రాబోయే కాలంలో ప్రజలు టీఆర్ఎస్, బీజేపీని బొందపెట్టడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అవసరంలేకున్నా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అయోధ్య, పుల్లారెడ్డి, కమటం వెంకన్న, ఎల్లయ్య, లక్ష్మీనారాయణ, సర్వర్, రమేష్, సీతారామిరెడ్డి, మల్లికార్జున్, కామిశెట్టి రామారావు, పాయం లక్ష్మయ్య పాల్గొన్నారు.