కరోనా రక్షణ సౌకర్యాలు కల్పించాలి
ABN , First Publish Date - 2020-07-18T10:23:39+05:30 IST
కరోనా విజృంభిస్తున్న వేళ తమకు రక్షణ కల్పించాలని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జిల్లా ఆసుపత్రి ఎదుట ధర్నా

పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
జిల్లా ఆసుపత్రి ఎదుట పారిశుద్య,సెక్యూరిటీ,పెషంట్ కేర్ ఉద్యోగులు ధర్నా
మద్దతు ప్రకటించిన సీఐటీయూ,ఇప్టు
ఖమ్మంసంక్షేమవిభాగం,జూలై 17: కరోనా విజృంభిస్తున్న వేళ తమకు రక్షణ కల్పించాలని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జిల్లా ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతికి వినతిపత్రం అందజేశారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు తుమ్మ విష్ణువర్దన్, కళ్యా ణం వెంకటేశ్వరరావు, ఇప్టు జిల్లా కార్యదర్శి రామయ్య, రామారావు, విజయమ్మ, వెంకటరమణ, అంజలి, నాగలక్ష్మీ, జ్యోతి పాల్గొన్నారు.