ఉమ్మడి ఖమ్మంలో 106 మందికి కొవిడ్
ABN , First Publish Date - 2020-12-05T05:08:28+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 106మంది కొవిడ్ బారిన పడ్డారు.
కొత్తగూడెం కలెక్టరేట్ / ఖమ్మంసంక్షేమ విభాగం, డిసెంబరు 4: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం 106మంది కొవిడ్ బారిన పడ్డారు. భద్రాద్రి జిల్లాలో శుక్రవారం మొత్తం 1,642 మందికి పరీక్షలు నిర్వ హించగా... 82 మందికి పాజిటివ్ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగూడెం డివిజన్లో 57మంది, భద్రాచలం డివిజన్లో 25మంది పాజిటివ్ వచ్చిన వారిలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 24మందికి కరోనా వ్యాప్తి జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు.