ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 44 మందికి కొవిడ్
ABN , First Publish Date - 2020-12-14T04:55:04+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 44 మందికి కొవిడ్

కొత్తగూడెం కలెక్టరేట్ /ఖమ్మం సంక్షేమవిభాగం, డిసెంబరు 13: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం 44మంది కొవిడ్బారిన పడినట్టు వైద్యఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో మొత్తం 826మందికి పరీక్షలు నిర్వ హించగా 11మందికి పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. కొత్తగూడెం డివిజన్లో 10, భద్రాచలం డివిజన్లో ఒకటి పాజిటివ్ కేసు నమోదైంది. ఇక ఖమ్మంజిల్లాలో 33మంది కొవిడ్ బారిన పడ్డారని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు.