వరికోత యంత్రాల కొరత లేకుండా చూడాలి
ABN , First Publish Date - 2020-04-04T10:25:14+05:30 IST
జిల్లాలో వరికోత యంత్రాలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని కలెక్టర్ డాక్టర్ ఎంవీ.రెడ్డి
భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి
కొత్తగూడెం కలెక్టరేట్, ఏప్రిల్ 3 : జిల్లాలో వరికోత యంత్రాలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని కలెక్టర్ డాక్టర్ ఎంవీ.రెడ్డి వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పంట విస్తీర్ణాన్ని అంచనా వేసి, ఆ ప్రకారం కావాల్సిన యంత్రాలను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఐకేపీ ద్వారా 13, జీసీసీ ద్వారా 10, సహకార సంఘాల ద్వారా 184 మొత్తం 207 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా 1.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయుటకు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసినట్లు ఆయన వివరించారు. మార్కెట్లు మూసేసినందున గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు మండల వ్యవసాయ అధికారులు శనివారం నుంచి కూపన్లు పంపిణీ చేస్తారన్నారు.