గోదావరిలో ఇద్దరి గల్లంతు

ABN , First Publish Date - 2020-06-18T10:23:49+05:30 IST

భద్రాచలం వద్ద గోదావరిలో బుధవారం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

గోదావరిలో ఇద్దరి గల్లంతు

భద్రాద్రి వద్ద కొనసాగుతున్న గాలింపుచర్యలు


భద్రాచలంటౌన్‌, జూన్‌ 17: భద్రాచలం వద్ద గోదావరిలో బుధవారం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పట్టణంలోని అంబసత్రం కాలనీకి చెందిన గొంతున తులసీరామ్‌(12), హైదరాబాద్‌కు చెందిన పవన్‌కుమార్‌(20)లతో పాటు మరో ఇద్దరు కలిసి ఫోటో దిగేందుకని కుటుంబసభ్యులకు చెప్పి గోదావరికి వెళ్లారు. ఫొటోలు దిగిన అనంతరం నది స్థానానికి ఇద్దరు దిగారు. నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో తులసీరామ్‌తో పాటు పవన్‌ మునిగిపోయారు. ఈ విషయాన్ని వారితో పాటు వచ్చిన మరో కుటుంబసభ్యుడు స్థానికులకు తెలిపారు. సంఘస్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు కాలింపు చర్యలు కొనసాగినా ఇద్దరి ఆచూకీ లభించలేదు.

Updated Date - 2020-06-18T10:23:49+05:30 IST