సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-07-14T11:15:19+05:30 IST
వర్షాకాలంలో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో
ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు
ఇల్లెందురూరల్,జూలై13: వర్షాకాలంలో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు సూచించారు. సోమవారం ఇల్లెందు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. సుభాష్నగర్ గ్రామ పంచాయతీలోని జీసీసీ పసుపు, కారం కేంద్రాలను సందర్శించి, పసుపు, కారం తయారీ విధాన్నా అడిగి తెలుసుకున్నారు. కారం శుద్ధికర్మగారాన్ని పరిశీలించారు.
అనంతరం వైటీసీలోని అధికారులతో మాట్లాడారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాఽధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ప్రతి గ్రామంలో డెంగ్యూ, మలేరియా నిర్ధారణ పరీక్షల కోసం రక్త నమునాలు సేకరించాలని తెలిపారు. అనంతరం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డీఏం కుంజ వాణి, ఈఈ రాములు, ఏఈ సయ్యద్ సలార్ తదితరులు పాల్గొన్నారు.