అందుబాటులోకి మణుగూరు క్వారంటైన్ వార్డ్
ABN , First Publish Date - 2020-03-27T11:54:55+05:30 IST
మణుగూరు వంద పడకల ఏరియా ఆసుపత్రిని జిల్లా క్వారంటైన్ కేంద్రంగా అధికారులు సిద్ధం చేశారు. ఆసుపత్రిలో
మూడుషిప్టులు నలుగురు వైద్యులతో సేవలు
ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ రెడ్డి
మణుగూరురూరల్, మార్చి26: మణుగూరు వంద పడకల ఏరియా ఆసుపత్రిని జిల్లా క్వారంటైన్ కేంద్రంగా అధికారులు సిద్ధం చేశారు. ఆసుపత్రిలో కరోనా అనుమానితులను 100మందిని పరీక్షించేందుకు సరిపడా పడకల వార్డులను ఏర్పాటు చేశారు. మూడు షిప్టుల్లో నలుగురు డాక్టర్లులతో పాటు ఓ స్టాఫ్నర్సు, మల్టీపర్పస్ సూపర్వైజర్ వైద్యసేవలు అందించనున్నారు. వైద్యులు రాంప్రసాద్తో పాటు నరహారి, ఉమాదేవి, గౌతమీ పుత్ర, సిబ్బంది తదితరులుసేవలందించనున్నారు.
గురువారం ఆసుపత్రిని కలెక్టర్ ఎంవీరెడ్డి సందర్శించారు. ఆసుపత్రి వార్డులను పరిశీలించారు అనంతరం ఏరియా ఆసుపత్రిలోని ఓ నివాసంలో స్వీయ క్వారంటైన్లో ఉన్న ఓ వ ్యక్తిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాల కోసం ఇంటింటి సర్వేను చేపట్టామన్నారు.