మరో 222 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-09-29T06:23:17+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర గణాంకాల ప్రకారం ఆదివారం 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
కొత్తగూడెం కలెక్టరేట్, సెప్టెంబర్ 28: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర గణాంకాల ప్రకారం ఆదివారం 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఖమ్మం జిల్లాలో 26 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో మొత్తం 2,018మందికి పరీక్షలు నిర్వహించగా 196 మందికి పాజిటివ్ వచ్చింది. కొత్తగూడెం డివిజన్లో 103, భద్రాచలం డివిజన్లో 93 కేసులు నమోదయ్యాయి.