ఆన్లైన్ చెస్లో నగర క్రీడాకారిణి ప్రతిభ
ABN , First Publish Date - 2020-11-21T06:29:04+05:30 IST
ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన ఆలిండియా స్థాయి ఎన్ఎండీసీ ఆన్లైన్ చెస్ టోర్నీలో నగరంలోని గీతాంజలి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న సేతు శ్రీవల్లి ప్రతిభ చూపి నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది...

ఖమ్మం స్పోర్ట్స్, నవంబరు 20: ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన ఆలిండియా స్థాయి ఎన్ఎండీసీ ఆన్లైన్ చెస్ టోర్నీలో నగరంలోని గీతాంజలి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న సేతు శ్రీవల్లి ప్రతిభ చూపి నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. టోర్నీలో మొత్తం 200 మంది క్రీడాకారులు పాల్గొనగా బాలికల విభాగంలో అత్యంత చాకచక్యంగా ఎత్తులకు పై ఎత్తులు వేసి నాల్గవ బహుమతిని సాధించింది. శ్రీవల్లి కేవలం ఆరు నెలల్లోనే హైదరాబాద్కు చెందిన సీనియర్ చెస్ కోచ్ కె. శ్రీనివాసరాజు వద్ద శిక్షణ తీసుకొని ఆల్ ఇండియా స్థాయిలో నగదు బహుమతి సాధించడం విశేషం. ప్రతిభ చూపి పతకం సాధించిన శ్రీవల్లిని గీతాంజలి పాఠశాల యజమాన్యం, తల్లి తండ్రులు అభినందించారు. భవిష్యత్లో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.