వైభవంగా వైకుంఠ ఏకాదశి
ABN , First Publish Date - 2020-12-26T05:49:13+05:30 IST
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో శుక్ర వా రం వైకుంఠ ఏకాదశి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు.
కరీంనగర్ కల్చరల్/ఇల్లందకుంట, డిసెంబరు 25: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో శుక్ర వా రం వైకుంఠ ఏకాదశి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. ఉదయత్పూర్వం నుంచే భక్తులు ఆల యాల వద్ద బారులు తీరి ఉత్తరద్వారం గుండా పర మాత్మను దర్శించుకున్నారు. కరీంనగర్లో మార్కెట్ రోడ్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈవో పీచర కిషన్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఉత్తర ద్వారం వద్ద శేషవాహనంపై నిలిపిన శ్రీవారిని దర్శించుకుని తరించారు. మేయర్ సునీల్రావు, అడిషనల్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, సీపీ కమ లాసన్రెడ్డి, ట్రైనీ ఐపీయస్ రశ్మి పెరుమాళ్, ఏసీపీ డాక్టర్ అశోక్, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, సీహెచ్ గంగాధర్ స్వా మి వారిని దర్శించుకున్నారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి, ఉత్తరద్వారందర్శనం చేసుకొని మొ క్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ సరిగోమ్ముల పావని-వెంకటేష్ పాల్గొన్నారు.