రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2020-12-16T04:57:38+05:30 IST

రాష్ట్ర ంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగల భ ర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లు, లెక్చ రర్లకు గౌరవ వేతనం అందజేయాలని బీజే వైఎం జిల్లా అధ్యక్షుడు రావుల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. సిరిసిల్లలో మంగళవారం బీజేవైఎం జిల్లా కమిటీ ఆఽధ్వర్యంలో తహ సీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు.

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
సిరిసిల్లలో ఽధర్నా చేస్తున్న బీజేవైఎం నాయకులు

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 15 : రాష్ట్ర ంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగల భ ర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లు, లెక్చ రర్లకు గౌరవ వేతనం అందజేయాలని బీజే వైఎం జిల్లా అధ్యక్షుడు రావుల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. సిరిసిల్లలో మంగళవారం బీజేవైఎం జిల్లా కమిటీ ఆఽధ్వర్యంలో తహ సీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు.  నిరుద్యోగులకు జీవనభృతిని అమలు చేయాలన్నారు. అంతకుముందు తహసీల్దార్‌ మాల్లారెడ్డికి వినతి పత్రం అందజేశారు.  బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు, బీజే వైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణువర్ధన్‌, పట్టణ అధ్యక్షుడు భాస్కర్‌, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు వెంకట్‌, జిల్లా కార్యదర్శి అనిల్‌గౌడ్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ, ప్రసాద్‌, దావీదు, ప్రభాకర్‌, హరీష్‌, అఖిల్‌ పాల్గొన్నారు. 

ఇల్లంతకుంట: బీజేవైఎం అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో  తహసీల్‌ కార్యాలయం ఎదుట  ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్‌, నాయకులు పాల్గొన్నారు. 

ఎల్లారెడ్డిపేట:నిరుద్యోగ భృతి చెల్లించాలని  బీజేవైఎం నాయకులు మంగళవారం ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.  అనంతరం ఆర్‌ఐ నవీన్‌కు వినతి పత్రం అందజేశారు.  నాయకులు సాయికుమార్‌, అనుష్‌యాదవ్‌, రాజు పాల్గొన్నారు.

తంగళ్లపల్లి:  తంగళ్లపల్లి తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట  బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహిం చాయి.  అనంతరం తహసీల్దార్‌ సదానందంకు వినతి పత్రం అందజేశారు.  నాయకులు వెంకటి, ఆంజనేయులు, రాజు, సంతోష్‌ పాల్గొన్నారు.

గంభీరావుపేట: గంభీరావుపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో  ధర్నా చేపట్టారు.  అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.  బీజేపీ మండల అధ్య క్షుడు అశోక్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు నరేష్‌చారి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు   పర్శాగౌడ్‌ ఉన్నారు. 

వేములవాడ టౌన్‌:  బీజేవైఎం రాష్ట్ర నాయకుడు జింక అనిల్‌ ఆధ్వర్యంలో వేములవాడ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.  బీజే వై ఎం నాయకులు శ్రీనివాస్‌, శివ, రాహు ల్‌, మారవేణి మహేష్‌  పాల్గొన్నారు. 

చందుర్తి: చందుర్తి తహసీల్దార్‌ కార్యా లయం ఎదుట బీజేవైఎం నాయ కులు   ధర్నా చేపట్టారు.  అనంతరం తహసీ ల్దార్‌ నరేష్‌కు వినతి పత్రం అందజే శారు. బీజేవైఎం ఆధ్యక్షుడు సతీష్‌, బీజేపీ మండల ఆధ్యక్షుడు రాఖేష్‌, శ్రీకాంత్‌, అనిల్‌ పాల్గొన్నారు. 

రుద్రంగి: రుద్రంగి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం బీజేవైఎం రాష్ట్ర పిలుపు మేరకు నాయకులు ధర్నా చేపట్టారు.   బీజేపీ మండల అధ్యక్షుడు పడాల గణేష్‌  ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.  నాయకులు శ్రావణ్‌,  ప్రవీణ్‌,   వంశీకృష్ణ, వినీత్‌, మనోహర్‌, సురేష్‌ పాల్గొన్నారు.

కోనరావుపేట: బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మిర్యాల్‌కార్‌ బాలాజీ ఆధ్వర్యంలో మంగళవారం  తహసీల్దార్‌ నరేందర్‌కు వినతిపత్రం అంద జేశారు.  బీజేవైఎం నాయకులు బైరగోని సురేష్‌,  మోహన్‌,  అజయ్‌, రాజుకుమార్‌, శ్రీపాల్‌, నవీన్‌, సంతోష్‌, ప్రభాకర్‌  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T04:57:38+05:30 IST