పగబట్టిన మృత్యువు

ABN , First Publish Date - 2020-06-23T10:17:28+05:30 IST

రెక్కాడితేకానీ డొ క్కాడని కుటుంబమది. చెట్టంత కొడుకులు కళ్ల ముందే నేలరాలిపోతూంటే తల్లిదండ్రులు తల్ల డిల్లిపోయారు. ఆ కుటుంబాన్ని

పగబట్టిన మృత్యువు

19 రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు సోదరులు మృతి


సుల్తానాబాద్‌, జూన్‌ 22: రెక్కాడితేకానీ డొ క్కాడని కుటుంబమది. చెట్టంత కొడుకులు కళ్ల ముందే నేలరాలిపోతూంటే తల్లిదండ్రులు తల్ల డిల్లిపోయారు. ఆ కుటుంబాన్ని మృత్యు వు పగబట్టిందా అన్నట్టుగా వరుసగా ఒకే కు టుంబానికి చెందిన ముగ్గురు సోదరులు 19 రోజుల వ్యవధిలో వేర్వేరు కారణాలతో మర ణించడంతో వారి కుటుంబాలు రోడ్డునపడ్డా యి. సుల్తానాబాద్‌ మండలం కనుగుల గ్రా మానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి సోమవారం కరోనాతో మృతి చెందాడు. కనుగులు గ్రామా నికి చెందిన ఒక యువకుడు హైదరాబాద్‌లో క్షురకుడిగా పని చేస్తూ అనారోగ్యానికి గురై (ఎయిడ్స్‌) ఈ నెల 8న ఉస్మానియా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


అత ని మృతదేహాన్ని మరో సోదరుడు(40) తీసు కువచ్చి కనుకులలో అంత్యక్రియలు నిర్వహిం చాడు. ఆ తర్వాత అతను కూడా అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి చి కిత్సకోసం వెళ్లగా కరోనా పరీక్షలు నిర్వహిం చారు. 16న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అ యింది. 17న గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సోమవారం అతను కూడా మృతిచెందాడు. వీరిద్దరి కన్నా చిన్న వాడైన మరో సోదరుడు (35) సింగరేణిలో ఉద్యోగం చేసేవాడు.


అతను కూడా ఈ నెల 3న బ్రెయి న్‌ ట్యూమర్‌తో హైదరాబాద్‌లో చికిత్స పొం దుతూ మృతి చెందాడు. ఇలా ముగ్గురు అన్న దమ్ములు కేవలం 19 రోజుల్లోనే మృతి చెంద డంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అ వుతున్నారు. ముగ్గురికి వివాహాలు కాగా వీరి కి భార్యా పిల్లలలు ఉన్నారు. వీరి తల్లిదం డ్రులకు నలుగురు సంతానం. అందిరి కంటే పెద్దవాడు కనుగులలోనే ఉంటున్నాడు.

Updated Date - 2020-06-23T10:17:28+05:30 IST