జెండా ఆవిష్కరించనున్న మంత్రి ఈశ్వర్
ABN , First Publish Date - 2020-08-15T10:28:26+05:30 IST
స్వాత్రంత్య వేడుకలకు జగిత్యాల కలెక్టరేట్ ముస్తాబు అయ్యింది. జిల్లా ఆవిర్భావం నాటి నుంచి జగిత్యాల ఖిల్లాలో వే డుకలు
జగిత్యాల, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): స్వాత్రంత్య వేడుకలకు జగిత్యాల కలెక్టరేట్ ముస్తాబు అయ్యింది. జిల్లా ఆవిర్భావం నాటి నుంచి జగిత్యాల ఖిల్లాలో వేడుకలు నిర్వహించగా కరోనా వైరస్ ప్రభావంతో సా దాసీదాగా వేడుకలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా కలెక్టరేట్ లోనే వేడుకలు నిర్వహించేందుకు అధికారులు సాదాసీదా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టరేట్ లో ఉదయం 10గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్, అదనపు క లెక్టర్లు, జడ్పీ ఛైర్పర్సన్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, బ ల్దియా ఛైర్మెన్లు హాజరుకానున్నారు. కాగా శనివారం నిర్వహించనున్న వేడుకల రిహార్సల్స్, పోలీస్ పరేడ్ను అదనపు ఎస్పీ ధక్షిణామూర్తి పర్యవేక్షించారు.