రైతు వేదిక భవన నిర్మాణాల పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-08-15T10:27:07+05:30 IST
రైతు వేదిక భవన నిర్మాణ పనుల వేతవంతం చేయాలని కలెక్టర్ గుగులోతు రవి అన్నారు
కొడిమ్యాల, ఆగస్ట్టు 14 : రైతు వేదిక భవన నిర్మాణ పనుల వేతవంతం చేయాలని కలెక్టర్ గుగులోతు రవి అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాలలో నిర్మిస్తున్న రైతుల వేదిక భవనాలను పరిశీలించారు. తిర్మాలాపూర్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. కొడిమ్యాల, నల్లగొండ, పూడూర్, గ్రామాలలో నిర్మిస్తున్న వాటి పనులను సెప్టెంబరు 15 లోగా పూర్తి చేయాలన్నారు. అనంతరం శ్రీరాములపల్లి గ్రామ సమీసాన ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని, వైకుంఠదామాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రవీందర్రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణారావు, పూడూర్ సింగిల్ విండో ఉపాద్యక్షుడు రమేష్, ఇతర అధికారులు ఉన్నారు.