క్షయ వ్యాధి నివారణే ధ్యేయంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2020-12-19T05:40:54+05:30 IST

క్షయ వ్యాధి గ్రస్తులకు అన్ని విధా లుగా ప్రభుత్వ సేవలు అందించి, రానున్న రోజుల్లో క్షయ వ్యాధి నివార ణే ధ్యేయంగా వైద్య సిబ్బంది పని చేయాలని రాష్ట్ర టీబీ నివారణ జా యింట్‌ డైరెక్టర్‌ ఆడేపు రాజేశం అన్నారు.

క్షయ వ్యాధి నివారణే ధ్యేయంగా పనిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ డైరెక్టర్‌

జగిత్యాల టౌన్‌, డిసెంబరు 18: క్షయ వ్యాధి గ్రస్తులకు అన్ని విధా లుగా ప్రభుత్వ సేవలు అందించి, రానున్న రోజుల్లో క్షయ వ్యాధి నివార ణే ధ్యేయంగా వైద్య సిబ్బంది పని చేయాలని రాష్ట్ర టీబీ నివారణ జా యింట్‌ డైరెక్టర్‌ ఆడేపు రాజేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హా లులో శుక్రవారం క్షయ వ్యాధి నివారణపై జిల్లాలోని అన్ని ప్రాఽథమిక ఆ రోగ్య కేంద్రాల వైద్య అధికారులు, సిబ్బందితో జాయింట్‌ డైరెక్టర్‌ రాజేశం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా నమోదైన కేసుల వివరాలు, కేసులపై అనుసరిస్తున్న విధానాలపై సమీ క్షించారు. అనంతరం జాయింట్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ క్షయ రహిత జి ల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. క్షయ వ్యా ధి సోకిన వారికి ప్రభుత్వం అందించే రూ. 500 పోషకాహార భత్యం అందేలా చూడాలన్నారు. టీబీ సూచికల్లో రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉందని, వ్యాధిని నివారించి మొదటి స్థానం రావడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌, క్ష య నివారణ అధికారి శ్రీనివాస్‌, ప్రొగ్రాం అధికారులు సమియోద్దిన్‌, శ్రీపతి. గీతిక, రాష్ట్ర సాంకేతిక సహాయ అధికారి వసు ప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-19T05:40:54+05:30 IST