ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2020-12-15T05:40:56+05:30 IST

రాష్ట్రం లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీజే పీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరెట్‌ ఎదుట ధర్నా చేప ట్టారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి
అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకలు

 బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ 

పెద్దపల్లి టౌన్‌, డిసెంబరు 14: రాష్ట్రం లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీజే పీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరెట్‌ ఎదుట ధర్నా చేప ట్టారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనా రాయణ మాట్లాడు తూ ఐదేళ్లకోసారి వర్తింపజేయాల్సిన 27 శాతం పీఆర్సీ సమయం గడిచి రెండేళ్ల యినా ఇంకా ఇవ్వలేదన్నారు. నిలిచి పోయన పదోన్నతులను వెంటనే అమలు చేయాలని, అంతర్‌ జిల్లా బదిలీలను చేపట్టాలని, కరువు భత్యం ఇవ్వాలని సూచించారు. కేజీ టూ పీజీ విధ్యను అమ లు చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధ్యను నిర్వర్యం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.  అనం తరం కలెక్టరేట్‌లోకి ఐదుగురినే అనుమతించినా ఎక్కువ మంది రావడంతో వినతిపత్రం తీసుకు నేందుకు కలెక్టర్‌ నిరాకరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.  కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, మీసా అర్జున్‌రావు, పిన్నింటి రాజు, ఎస్‌ కుమార్‌, పర్శ సమ్మయ్య, శివంగారి సతీష్‌, జాపతి రాజేష్‌, రాజవీరు తదితరులున్నారు. 


Updated Date - 2020-12-15T05:40:56+05:30 IST