‘గీత’ను అప్పగించేందుకు చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2020-12-18T04:55:51+05:30 IST
ఇరవై సంవత్సరాల క్రితం తప్పిపోయిన మూగ, చెవిటి బాలిక తమ కూతురేనని, ఆమెను తమకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన బొల్లి స్వామి గురువా రం కలెక్టర్ భారతి హోళికేరికి వినతిపత్రం ఇచ్చారు.

- కలెక్టర్కు బొల్లి స్వామి వినతి
పెద్దపల్లి, డిసెంబర్ 17 (ఆంధ్రజ్యోతి): ఇరవై సంవత్సరాల క్రితం తప్పిపోయిన మూగ, చెవిటి బాలిక తమ కూతురేనని, ఆమెను తమకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన బొల్లి స్వామి గురువా రం కలెక్టర్ భారతి హోళికేరికి వినతిపత్రం ఇచ్చారు. తనకు ఇద్దరు కూతుర్లు అని, చిన్న కుమార్తె సరిత 1993లో జన్మించిందని, ఆమె పుట్టుకతోనే మూగ, చెవిటి అని పేర్కొన్నా రు. 2001లో ఎనిమిదేళ్ల వయసులో తప్పిపో యిందని, అప్పటి నుంచి ఆమె జాడ దొరక లేదని తెలిపారు. ఆమె తప్పిపోయి పాకిస్తా న్కు చేరిందని, ఆమె కట్టు బొట్టు చూసి భారత దేశస్థురాలని భావించి అప్పటి విదే శాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు సమా చారం ఇవ్వడంతో ఇండియా తీసుకవచ్చా రని సోషల్ మీడి యా ద్వారా తెలు సుకున్నానని చె ప్పారు. ఐదేళ్లుగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఒక స్వచ్ఛంద సంస్థలో ఉందని, అక్కడి నుంచి ఇటీవల బాసరకు తీసుకవచ్చారని తెలిపా రు. తమ ఇంటి సమీపంలో గుడి, చెరువు ఉందని అవే ఆనవాళ్ల గురించి గీత తెలు పుతున్నదన్నారు. స్వచ్ఛంద సంస్థ వారిని ఫోన్లో సంప్రదిస్తే కలెక్టర్కు దర ఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో దరఖాస్తు చేశానని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన గీత ఫొటో తన కూతురు సరితదే నని ఆయన తెలిపారు.