సన్నరకం ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2020-12-02T05:06:30+05:30 IST

సన్నరకం వరిధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అధికారులకు సూచించారు.

సన్నరకం ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలి
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శశాంక

ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

కరీంనగర్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సన్నరకం వరిధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలపై జిల్లాలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న సన్నరకం వరిధాన్యాన్ని గుర్తించి త్వరితగతిన కొనగోలు చేసి వెంటనే మిల్లులకు సరఫరా చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మొక్కజొన్నలను ఈ నెల 7 వరకు వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయాధికారులు ధాన్యాన్ని పరిశీలించి రైతులకు నాణ్యత విషయంలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సంబంధిత అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తరచూ తనిఖీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్‌రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌ రెడ్డి జిల్లా సహకార అధికారి శ్రీమాల, డీఆ ర్‌డీవో పీడీ రవీందర్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T05:06:30+05:30 IST