సమస్యలను పరిష్కరించాలి: బండి సంజయ్కుమార్
ABN , First Publish Date - 2020-02-28T11:36:47+05:30 IST
పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎంపీ బండి సంజయ్కుమార్ అధికారులకు సూచించారు.
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 27: పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎంపీ బండి సంజయ్కుమార్ అధికారులకు సూచించారు. గురువారం 38వ డివిజన్లో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతితో కలిసి ‘పట్టణ ప్రగతి’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు. మురుగునీటి కాలువలు, ఇతర సమస్యలను ఆయన గుర్తించి వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతిధులు, ప్రజలు సమన్వయంతో ముందుకెళితేనే పట్టణాలు, పల్లెలు సమగ్రాభివృద్ధికీ నోచుకుంటాయని అన్నారు. పార్టీలకతీతంగా చేపడుతున్న ఈకార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ‘పట్టణ ప్రగతి’లో గుర్తించిన సమస్యలను పరిష్కరించినపుడే ఈ కార్యక్రమానికి సార్థకత ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవితోపాటు పలువురు అధికారులు, స్థానికులు, వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.