కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల
ABN , First Publish Date - 2020-12-21T04:56:51+05:30 IST
మండలంలోని కాకతీయ ప్రధాన కాలువ ద్వారా ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు.

తిమ్మాపూర్, డిసెంబరు 20: మండలంలోని కాకతీయ ప్రధాన కాలువ ద్వారా ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఉదయం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఆదికారులు సాయంత్రానికి 3500 క్యూసెక్కులకు పెంచారు. క్రమేపీ ఆరు వేల క్యూసెక్కుల వరకు నీటి విడుదలను పెంచుతామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం లోయర్ మానేర్ రిజర్వాయర్లో 24.034 టీఎంసీలకు గాను 22.581 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 3.500 క్యూసెక్కుల అవుట్ ఫ్లోతోపాటు తాగునీటి అవసరాలకు 247 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నట్లు ఆదికారులు తెలిపారు. లోయర్ మానేర్ రిజర్వాయర్ దిగువన ఉన్న చివరి ఆయకట్టు వరకు ఉన్న పంటలను పండించుకునేందుకు ఈ రబి పంటకు మార్చి 31వ తేది వరకు నిరంతరయంగా నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, కాలువలను ధ్వంసం చేయవద్దని నీటిపారుదల శాఖ అధికారులు కోరారు. కార్యక్రమంలో వర్క్ ఏఈలు కాళీదాస్, వంశీధర్ పాల్గొ పాల్గొన్నారు.