మిడ్‌ మానేరులోకి 10.76 లక్షల రొయ్య పిల్లలు

ABN , First Publish Date - 2020-11-28T05:27:22+05:30 IST

జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లోకి శుక్రవారం 10.76 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేశారు.

మిడ్‌ మానేరులోకి 10.76 లక్షల రొయ్య పిల్లలు
మిడ్‌ మానేరులో రొయ్య పిల్లలను వదులుతున్న అధికారులు

సిరిసిల్ల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లోకి శుక్రవారం 10.76 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేశారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా జిల్లాలో 14.25 లక్షల రొయ్య విత్తనాలను లక్ష్యంగా పెట్టుకోగా మిడ్‌మానేరులో మత్స్య శాఖ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌  శ్రీనివాస్‌, సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసరావు చేతుల మీదుగా రొయ్య పిల్లలను వదలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులు చేపల వేటలో నైపుణ్యం పెంచుకోవాలని నీటి వనరులను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. మత్స్య శాఖ అధికారులు మహ్మద్‌ ఖదీర్‌ అహ్మద్‌, కిరణ్‌కుమార్‌, సిబ్బంది సతీష్‌, శివ, లక్ష్మీరాజం పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-28T05:27:22+05:30 IST