ఉపాధిహామీ పనుల వద్ద భౌతిక దూరం పాటించాలి
ABN , First Publish Date - 2020-05-14T09:54:03+05:30 IST
ఉపాధిహామీ కూలీలు భౌతిక దూరం పాటించేలా, మాస్క్ లు ధరించేలా చూడాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్, మే 13:ఉపాధిహామీ కూలీలు భౌతిక దూరం పాటించేలా, మాస్క్ లు ధరించేలా చూడాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. జడ్పీ కార్యా లయంలో బుధవారం సాంఘీక సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై నిర్వహిం చిన స్థాయి సంఘాల సమావేశంలో మాట్లా డారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, వైస్ చైర్మన్ సిద్దం వేణు పాల్గొన్నారు.
బీడు భూములు సస్యశ్యామలం
గోదావరి జలాలతో రుద్రంగిలోని బీడు భూములు సస్యశ్యామలం అవుతున్నాయని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. మండల కేంద్రం శివారులో గండి వెంకటేశ్వరస్వామి ఆల యం వద్ద నాగారం చెరువులోకి గోదావరి జలాలను విడుదల చేశారు. జగిత్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ వసంత, రుద్రంగి, ఫ చందుర్తి ఎంపీపీలు పాల్గొన్నారు.
మండలంలోని మరిమడ్లలో ఉపా ధిహామీ పనులు చేస్తూ గుండెపోటుతో మృతి చెం దిన తాటకర్ల లింబయ్య కుటుంబానికి జడ్పీ చైర్ప ర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి బుధవారం రూ. 50 వేల విలువైన చెక్కు అందజేశారు.