సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళుతూ మృత్యువాత
ABN , First Publish Date - 2020-08-02T10:13:55+05:30 IST
సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళుతూ మృత్యువాత
కోల్సిటీ, ఆగస్టు 1: సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళుతున్న లొకారి స్వప్న (25) అనే వివాహిత శనివారం గోదావరిఖని వద్ద రోడ్డు ప్రమాదానికి గురైమృతిచెందింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా బీజోన్ రామకృష్ణాపూర్కు చెందిన స్వప్నను కరీంనగర్లో ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న హరికృష్ణ కు ఇచ్చి వివాహం జరిపించారు. రాఖీపండుగ సందర్భం గా స్వప్న సోదరుడు రాజేందర్ తన సోదరిని తీసుకువచ్చేందుకు వెళ్లాడు. స్వప్న భర్త హరికృష్ణ ఆమెను పెద్దపల్లిలో దిగబెట్టాడు. అక్కడి నుంచి రాజేందర్ బైక్పై తీసుకువస్తుండగా ‘ఖని’ జీఎంకార్నర్ వద్ద వెనుకనుంచి లారీఢీకొ ట్టింది. స్వప్న అక్కడికక్కడే మృతిచెందగా,రాజేందర్కు తీవ్రగాయాలయ్యాయి. ‘ఖని’ వన్టౌన్ ఏఎస్ఐ శారద ఘటనస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సీఐ-2 రాజ్కుమార్గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.