అయ్యయ్యో..వానరమా

ABN , First Publish Date - 2020-08-02T10:13:18+05:30 IST

అయ్యయ్యో..వానరమా

అయ్యయ్యో..వానరమా

రామడుగు, ఆగస్టు 1: రామడుగు మండలంల గోపాల్‌రావుపేట కూరగాయల మార్కెట్‌ వద్ద గల చెట్టుకు ప్రమాదవశాతు ఉరిపడి ఒక వానరం మృతిచెందింది. ఎక్కడినుంచో వచ్చిన వానరం కూరగాయల మార్కెట్‌లో అటు ఇటు సందడి చేస్తూ తాడుకి చుట్టుకుంది. ఆ తాడుతో చెట్టుపై తిరుగుతుండగా ప్రమాదవశాతు మెడకు ఉరిపడి ఊపిరాడక మృత్యువాతపడింది. విషయాన్ని గమనించిన గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఎంపీ టీసీ ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, నాయకులు మల్లేశం, కమలాకర్‌, పాపిరెడ్డి, మహేశ్‌, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-08-02T10:13:18+05:30 IST