జనతా కర్ఫ్యూలో ప్రజలు పాల్గొనడం అభినందనీయం

ABN , First Publish Date - 2020-03-23T11:01:54+05:30 IST

కరోనా వైర స్‌ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవ సరం ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

జనతా కర్ఫ్యూలో ప్రజలు పాల్గొనడం అభినందనీయం

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

కరోనా వైరస్‌ పట్ల మరింత అప్రమత్తత అవసరం


జగిత్యాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర స్‌ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవ సరం ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. భారత ప్రధా ని మోదీఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమని, తన రాజకీయ జీవితం లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడం ఇదే మొ దటిసారి అని అన్నారు.


జగిత్యాలలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ క రోనా వైరస్‌ను అరికట్టేందుకు ఇప్పటివరకు ఎలాంటి మందులు కనిపెట్టలేదని, సెల్ఫ్‌ క్వారంటైన్‌ ద్వారానే దీ నిని అరికట్టవచ్చని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్‌ క్వారంటైన్‌ పాటించాల్సిన అవసరం ఉంద న్నారు. కరోనా వ్యాధికి ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఇతర వ్యాధులతో బాధ పడుతున్నవారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు.


 జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధప డుతూ హైద రాబాద్‌లోని నిమ్స్‌కు వెళ్తే చికిత్సలు చేయ డం లేదని, ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని పేర్కొనడం బాధాకరమన్నారు. తానే స్వయంగా డాక్టర్లతో మాట్లాడా నని, కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూనే ఇతర వ్యాధు లకు కూడా చికిత్సలు అందేలా ముఖ్యమంత్రి చొరవ తీ సుకోవాలని కోరారు.

Updated Date - 2020-03-23T11:01:54+05:30 IST