మహిళా దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2020-11-26T05:26:49+05:30 IST

మహారాష్ట్రకు చెందిన మహిళా దొంగల ముఠాసభ్యులు మమత లండే(30), కాజల్‌ మంకార్‌(22), మంకార్‌ అంజలీ అలియాస్‌ సంగీత(28), సవిత హతగాడి(30) కరీంనగర్‌ ఒకటోఠాణా పోలీ సులు బుధవారం అరెస్టు చేశారు.

మహిళా దొంగల ముఠా అరెస్టు

కరీంనగర్‌ క్రైం, నవంబరు 25: మహారాష్ట్రకు చెందిన మహిళా దొంగల ముఠాసభ్యులు మమత లండే(30), కాజల్‌ మంకార్‌(22), మంకార్‌ అంజలీ అలియాస్‌ సంగీత(28), సవిత హతగాడి(30) కరీంనగర్‌ ఒకటోఠాణా పోలీ సులు బుధవారం అరెస్టు చేశారు. దోబీవాడ ఎల్‌ఐసీ చౌరస్తా వద్ద అనుమా నాస్పదంగా ఉన్న ఈ ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగత నాలు చేస్తున్న విషయంవెల్లడైంది. నలుగురు మహిళాసభ్యులున్న ఈ దొంగ లముఠా బస్సులోని మహిళా ప్రయాణికుల హాండ్‌బ్యాగ్‌లలో నగదు, ఆభర ణాలు, ఇతరవిలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. బస్సుఎక్కే సమయంలో ప్రయాణికులమాదిరిగా ఉంటూ మహిళల హాండ్‌బ్యాగ్‌ల జిప్లను తెరచి అందులోని విలువై సొమ్మును దొంగిలించి ఆవెంటనే బస్సు దిగిపోతుంటారు. మంగళవారం ఈ ముఠా కరీంనగర్‌ బస్టాండ్‌లో ఇదే విధంగా ఒక మహిళ బ్యాగ్‌లో నుంచి బంగారునెక్లెస్‌ దొగిలించినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకు న్నారు. అయితే ఆ నెక్లెస్‌ను మహారాష్ట్రకు చెందిన జితేందర్‌ లండెకు ఇచ్చా మని పట్టుబడిన మహిళా దొంగలు ఒప్పుకున్నారు. జితెందర్‌ లండే కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మహిళాదొంగలు గంజాయిని కూడా విక్రయి స్తున్నారని ఒకటోఠాణా సీఐ జీ విజయ్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2020-11-26T05:26:49+05:30 IST