అంబేడ్కర్‌ ఆశయాలతో ముందుకెళదాం

ABN , First Publish Date - 2020-04-15T10:46:00+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ ఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలతో ముందుకెళదామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ

అంబేడ్కర్‌ ఆశయాలతో ముందుకెళదాం

మంత్రి గంగుల కమలాకర్‌


సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ ఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలతో ముందుకెళదామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా కరీంనగర్‌ కోర్టు చౌరస్థాలో గల అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌  రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్‌ 3తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కన  మల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌,  మేయర్‌ సునీల్‌రావు,  బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి,  తెలంగాణ అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం, దళిత సం ఘాల నాయకులు మేడి మహేశ్‌,, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి,  చిగురుమామిడి ఎంపీ పీ కొత్త వినీత శ్రీనివాస్‌రెడ్డి,  సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, దళిత సంఘాల నేత మేడి రాజవీరు, దామెర సత్యం,  దళిత సంఘాల మహిళా నాయకు రాళ్లు, ఏబీవీపీ కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ కె శశాంక పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.


కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, డీఆరోవ్వ పవన్‌కుమార్‌, షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు బాలసుందరం, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి మాధవి, సమాచార శాఖ ఉపసంచాలకులు జి ప్రసాదరావు, సమాచార శాఖ సహాయ కా ర్యనిర్వహక సమాచార ఇంజనీర్‌ సిహెచ్‌ కొండయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-15T10:46:00+05:30 IST