మంథని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
ABN , First Publish Date - 2020-12-12T04:53:49+05:30 IST
మంథని పట్టణాన్ని అన్ని విధాలు సుందరం గా తీర్చిదిద్దుతామని చైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు.
![మంథని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020121111223346/12112020232250n62.jpg)
- మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ
మంథని, డిసెంబర్ 11: మంథని పట్టణాన్ని అన్ని విధాలు సుందరం గా తీర్చిదిద్దుతామని చైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశం ఆమె మాట్లాడా రు. పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రతను పెంచుతాతమన్నారు. ఇంటి ని ర్మాణాలకు ఆఫీసులో ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నా రు. గతంలో పనిచేసిన టీపీవోపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయన్నా రు. ప్రధాన రహదారిపై పెయింట్ వేయిస్తామన్నారు. రోడ్డు స్వీపింగ్ మి షన్, పోచమ్మవాడలో వాటర్ట్యాంక్ రిపేర్లాంటి పనులు చేయిస్తామన్నా రు. పట్టణంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.