పేద కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా
ABN , First Publish Date - 2020-11-27T05:08:19+05:30 IST
పేద కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా
![పేద కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా](https://media.andhrajyothy.com/appimg/galleries/2020112611365528/11262020233741n80.jpg)
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఆపన్న హస్తం కోసం ఎదు రు చూస్తున్న బాధిత కుటుం బానికి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు. ఆయన ఆదే శాల మేరకు గురువారం కలె క్టర్ కృష్ణభాస్కర్ కార్యాలయ ంలో నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు పత్రాలను అందజేశారు. వీర్నపల్లి మండలం మద్దిమల్లకు చెందిన ఇసికిల్ల రాజయ్య అనారోగ్యంతో ఈ నెల 21న మృతి చెందాడు. ఇల్లు లేకపోవడంతో టెంట్ కింద మృత దేహాన్ని ఉంచి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతుడి భార్య జ్యోతి, తల్లి గంగవ్వ, పిల్లలు అర్చన, నవ్య, అరవింద్ టెంట్ కిందనే ఉంటూ ఇబ్బం దులు పడుతున్నారు. ఆ కుటుంబం దీనస్థితిని తెలుసుకున్న కేటీఆర్ ఆదు కునేందుకు చర్యలు చేపట్టారు.