కరీంనగర్లో బీజేపీ ధర్నా
ABN , First Publish Date - 2020-10-03T18:25:59+05:30 IST
బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పలువురు పార్టీ శ్రేణులు ధర్నాలో పాల్గొన్నారు.

కరీంనగర్: బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పలువురు పార్టీ శ్రేణులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను టీఆర్ఎస్ లూటీ చేస్తోందని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కేసీఆర్ మాట తప్పారని...వెంటనే ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు.