కమనీయం.. లక్ష్మీనృసింహస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2020-12-01T06:09:49+05:30 IST

పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సోమవారం అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణం సాగింది.

కమనీయం.. లక్ష్మీనృసింహస్వామి కల్యాణం
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 30: పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సోమవారం అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణం సాగింది. స్వామి వారి కల్యాణాన్ని ఆలయ ఈవో శంకర్‌ ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛరన మధ్య ఘనంగా నిర్వహించారు. కల్యాణానికి వే లాదిమంది భక్తులు హాజరయ్యారు. సోమవారం కార్తీకపౌర్ణమి కావడంతో ఆల య ధ్వజస్థంభం వద్ద మహిళలు దీపారాధన చేసి మొక్కులు చెల్లించు కున్నా రు. గుట్టపై గల  లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పెద్దపల్లి సీఐ ప్రదీప్‌కుమా ర్‌ దంపతులు, గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ పర్సరమేష్‌ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా బ సంత్‌నగర్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శంకర్‌, ఆలయ ప్రధాన అర్చకులు కొండపాక లక్ష్మీనర్సింహచార్యులు, శ్రీకాంతా చార్యులు, శ్రీధర చార్యులుతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T06:09:49+05:30 IST