జగిత్యాలలో రైతు ఐక్య వేదిక నేతల అరెస్ట్
ABN , First Publish Date - 2020-10-23T15:57:54+05:30 IST
జిల్లాలో రైతు ఐక్య వేదిక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు ఛలో జగిత్యాలకు రైతు సంఘం నేతలు పిలుపు నిచ్చారు
జగిత్యాల: జిల్లాలో రైతు ఐక్య వేదిక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు ఛలో జగిత్యాలకు రైతు సంఘం నేతలు పిలుపు నిచ్చారు. మక్కలకు, సన్నరకం ధాన్యంకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అర్ధరాత్రి నుంచే పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. భారీగా పోలీసుల మోహరించారు.