జగిత్యాలలో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-10-03T18:46:26+05:30 IST
జిల్లాలోని మాల్యాల మండలంలోని తక్కళ్ళపల్లిలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది.

జగిత్యాల: జిల్లాలోని మాల్యాల మండలంలోని తక్కళ్ళపల్లిలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పేకాట ఆడకున్నా ఆడుతున్నారని పోలీసులు చెప్పడంతో మనస్తాపం చెందిన యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పార్టీ చేసుకుంటే పేకాట ఆడినట్లు చిత్రీకరించారని బంధువులు ఆరోపిస్తున్నారు. సాయి కిరణ్ మృతికి పోలీసులు బాధ్యత వహించాలని మృతుని బంధువుల ఆందోళనకు దిగారు.