ధరణి రిజిస్ర్టేషన్‌ల ప్రక్రియను పర్యవేక్షించాలి

ABN , First Publish Date - 2020-11-28T04:37:32+05:30 IST

ధరణి పోర్టల్‌ ధ్వారా నిర్వహిస్తున్న వ్యవసా య భూముల రిజిస్ర్టేషన్‌ల ప్రక్రియను ఎప్పటికప్పుడు అధికారులు పర్య వే క్షించాలని కలెక్టర్‌ రవి సూచించారు.

ధరణి రిజిస్ర్టేషన్‌ల ప్రక్రియను పర్యవేక్షించాలి
రైతుకు మ్యుటేషన్‌ ఫత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌ రవి

జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి

వెల్గటూర్‌, నవంబర్‌ 27 : ధరణి పోర్టల్‌ ధ్వారా నిర్వహిస్తున్న వ్యవసా య భూముల రిజిస్ర్టేషన్‌ల ప్రక్రియను ఎప్పటికప్పుడు అధికారులు పర్య వే క్షించాలని కలెక్టర్‌ రవి సూచించారు. శుక్రవారం జిల్లా వెల్గటూర్‌ తహసీల్దా ర్‌ కార్యాలయంలో ధరణి ఫోర్టల్‌ ద్వారా నిర్వహిస్తున్న వ్యవసాయ భూము ల రిజిస్ర్టేషన్ల ప్రక్రియను కలెక్టర్‌ రవి తనిఖీ చేశారు. ధరణి ఫోర్టల్‌ ద్వారా నిర్వహించే వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్ల ప్రక్రియపై కొనుగోలు, అక మ్మ కందారులకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచిం చారు. ఎవరు కూడా మద్యవర్తులను ఆశ్రయించవద్దన్నారు. అవసరమైతే త హసీల్థార్‌ కార్యాలయంలోని మీ సేవా కేంద్రాలలో స్లాట్‌ బుకింగ్‌లు చేయా లని ఆయన సూచించారు. అనంతరం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2020-21లో వంద శాతం సబ్సిడిపై కోటిలింగాల గ్రామంలోని ఎల్లం పల్లి బ్యాక్‌ వాటర్‌లో 3,09000 రొయ్య పిల్లల విడుదల కార్యక్రమంలో కలె క్టర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనర్స య్య, తహసీల్దార్‌ రాజేందర్‌, ఎంపీపీ లక్ష్మి, ఎర్రోళ్ల సతీష్‌, మత్స్యశాఖ అధి కారులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-28T04:37:32+05:30 IST