మరో 38మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-11-27T05:25:16+05:30 IST
జిల్లాలో కొత్తగా 38 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

కరీంనగర్, నవంబరు 26(ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలో కొత్తగా 38 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈమేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తన బులిటెన్లో పేర్కొంది. కరీంనగర్లో అర్బన్తో కలిపి మొత్తం 16మండలాలుండగా గురువారం వాటిలో ఎనిమిది మండలాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఇల్లందకుంట మండలంలోని లక్ష్మాజిపల్లి గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ ఽహైదరాబాద్లో కొవిడ్ చికిత్స తీసుకుంటూ గురువారం మృతిచెందింది.