కొత్తగా 109 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-10-07T06:18:44+05:30 IST

జిల్లాలో కొత్తగా 109 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో

కొత్తగా 109 మందికి కరోనా పాజిటివ్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొత్తగా 109 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొ న్నారు. స్థానికుల సమాచారం మేరకు మంగళవారం జిల్లాల్లో దాదాపు  180 మందికి వ్యాధి సోకినట్లు తెలిసింది.  హుజురాబాద్‌ డివిజన్‌ పరిధిలోని జమ్మికుంట మండలంలో 27 మందికి, హుజురాబాద్‌ మండలంలో ఏడుగురికి, వీణ వంక మండలంలో నలుగురికి, సైదాపూర్‌ మండలంలో ఒకరికి ,   శంకరపట్నం మండలంలో నలుగురికి కరోనా వ్యాధి సోకింది.


అలాగే కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ మండలంలో ఎనిమిది మంది, మానకొండూర్‌ మండలంలో ఏడుగురు, చొప్పదండిలో నలుగురు, గంగా ధర మండలంలో నలుగురు ,రామడుగు మండలంలో 11 మంది, చిగురుమామిడి మండలంలో ముగ్గురు, గన్నేరు వరంలో ఒకరు, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో ఇద్దరు, కొత్తపల్లి మండలంలో 11మంది కరోనా బారినపడ్డారు.  కరీంనగర్‌ పట్టణంలోని తిరుమల్‌నగర్‌లో 1, కట్టరాంపూర్‌ లో 2, భగత్‌నగర్‌లో 2, రేకుర్తిలో 4, విద్యానగర్‌లో 3, భాగ్యనగర్‌లో 1, సంతోష్‌నగర్‌లో 2, లక్ష్మీనగర్‌లో 2, హౌసింగ్‌బోర్డులో 5, మారుతీనగర్‌లో 4, కాపువాడలో 2, షాదీఖానా ఏరియాలో 3, కిసాన్‌నగర్‌లో 1, ఆదర్శనగర్‌లో 1 పాజిటివ్‌ కేసు నమోదైంది. చాలా మంది ప్రైవేట్‌ హాస్పి టల్స్‌లో సీటీస్కాన్‌ పరీక్షలు నిర్వహించుకొని పాజిటివ్‌ వచ్చిన వారు ఇళ్లలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. 

Read more