సుందరంగా కలెక్టరేట్ భవన నిర్మాణం
ABN , First Publish Date - 2020-12-04T04:54:17+05:30 IST
సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం సుందరంగా ఉందని, చుట్టు గుట్టలతో ఆహ్లాదకరంగా కనిపిస్తోందని పురపాలక ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తవుతున్న సమీకృత కలెక్టరేట్ భవనం, తెలంగాణ భవనాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
- పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు
సిరిసిల్ల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం సుందరంగా ఉందని, చుట్టు గుట్టలతో ఆహ్లాదకరంగా కనిపిస్తోందని పురపాలక ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తవుతున్న సమీకృత కలెక్టరేట్ భవనం, తెలంగాణ భవనాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. కలెక్టరేట్ భవనం బాగుందన్నారు. తెలంగాణ భవనంలోని గదులను మంత్రి పరిశీలించారు. సమావేశ మందిర నిర్మాణస్థలాన్ని చూశారు. అందరికీ ఉపయోగపడే విధంగా తెలంగాణ భవన్ ఉంటుందన్నారు. కలెక్టరేట్ భవనాన్ని త్వరలోనే ప్రారంభించుకుంటామన్నారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆ ర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ ఉన్నారు.