జిల్లాలో స్వచ్ఛభారత్ కార్యక్రమాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్
ABN , First Publish Date - 2020-09-12T11:09:50+05:30 IST
జిల్లాలో చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలపై ఇన్చార్జి కలెక్టర్ భారతి హోళి కేరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలపై ఇన్చార్జి కలెక్టర్ భారతి హోళి కేరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శనివారం కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. 2018-19 సంవత్సరం లో స్వచ్ఛ్భారత్ గ్రామీణ్ మిషన్లో జరిగిన ప్రగతి, అందులో ప్రజల భాగస్వామ్య అధికం గా ఉండడం వంటి అంశాలను పరిశీలించి దేశ వ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేశారు. అందులోభాగంగా రాష్ట్రంనుంచి పెద్దపల్లి జిల్లా ఎంపికకావడం గమనార్హం. ఈమేరకు పది జి ల్లాల కలెక్టర్లతో కేంద్ర ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండో దశ వడపోత ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.