టపాసులపై నిషేధం: వ్యాపారుల్లో ఆందోళన
ABN , First Publish Date - 2020-11-13T10:20:31+05:30 IST
దీపావళి టపా సుల కాల్చివేతపై నిషేధాన్ని అమలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో రా జన్న సిరిసిల్ల జిల్లాలో టపాసుల విక్రయదారుల ఆశలు నీరుగా రాయి
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల): దీపావళి టపా సుల కాల్చివేతపై నిషేధాన్ని అమలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో రా జన్న సిరిసిల్ల జిల్లాలో టపాసుల విక్రయదారుల ఆశలు నీరుగా రాయి. జిల్లాలో 80 మంది టపాసుల విక్రయాల కోసం లైసెన్స్లకు దరఖాస్తులు చేసుకు న్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా రెండు రోజుల ముందు లైసెన్స్లు జారీ అవుతా యని భావించి సిద్ధిపేట, జగిత్యాల, హైద రాబాద్ ప్రాంతాల్లోని హోల్సేల్ విక్రయదారు లకు లక్షల్లోనే అడ్వాన్స్లు చెల్లించారు. సిరిసిల్ల మా నేరు తీరంతో పాటు వేములవాడ, ముస్తాబాద్, ఎల్లా రెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట, మండల కేంద్రాల్లో కూడా రిటైల్ విక్రయ దారులు ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని నిబంధన లు ఉండగా ఈసారి హరిత ట్రి బ్యునల్ ఆదేశాలకు అనుగుణం గా గ్రీన్ టపాసులు మాత్రమే కాల్చాలని ముందుగా ఆదేశాలు వచ్చాయి.
చివరకు టపాసులు పూర్తిగా కాల్చడమే నిషేధమని చెపుతుండడం తో వ్యాపారుల్లో గందర గోళం ఏర్పడింది. ఇప్పటికే జిల్లాలో కోటి నుంచి కోటిన్నర వరకు వ్యాపారం సాగుతుండడంతో అ మేరకు 60 లక్షలకు పైగానే అడ్వాన్సులు చెల్లించి అందోళన చెందుతున్నారు.